సాగర్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తుండని తెలిసి వారం రోజులుగా కాంగ్రెసోళ్లకు వణుకు పుట్టింది. కేసీఆర్ రావొద్దని కుట్రలు చేసిండ్రు. కోర్టుల్లో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదుచేసిండ్రు. కేసీఆర్ వస్తే వాళ్ల బండారం బయటపడుతదని భయపడ్డరు. ప్రచారమే వద్దని, కేసీఆర్ రావద్దనే ఆశ్చర్యకరమైన మాటలు చెప్పినోళ్ల్లే ఈ రాష్ర్టాన్ని ఎక్కువ కాలం ఏలినోళ్లు. వారు ఈ నియోజకవర్గానికి ఏం చేసిండ్రు. ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి. అది మరిచి తిట్టడం మొదలు పెట్టిండ్రు. వాళ్ల కక్షలు తీర్చుకోవడం తప్ప వాళ్లు చేసింది చెప్పలే. కేసీఆర్ ఏం చేసిండ్రు అంటరు. కేసీఆర్ 14 ఏండ్లు ఉద్యమం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని తెచ్చిండు. అద్భుతమైన సంక్షేమపథకాలు తీసుకొచ్చి పరిపాలన చేసిండు. గిరిజన తండాలతోపాటు గోండుగూడెంలలో దళితవాడలు, బస్తీల్లో ఉన్న సమస్యలు స్వయంగా తెలుసుకొని రాష్ట్రానికి తండ్రిగా పరిష్కారం చేసిండు. వంద ఏైండ్లెనా తెలంగాణను ఎవరూ దాటిపోలేని విధంగా అభివృద్ధి చేసిండు. ఆరేండ్లలో మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ను తరిమికొట్టిండు. కరువు బారినపడ్డ ఈ జిల్లాను వ్యవసాయ జిల్లాగా చేసిండు. నాడు రెండు లక్షల ఎకరాలు కూడా నీరు పారని ఈ జిల్లాను 15లక్షల ఎకరాలు పారేలా చేసి రాష్ట్రంలోనే అత్యధికంగా పంటలు పండే జిల్లాగా చేసిండు.
-విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి