హైదరాబాద్ : ఆరు గ్యారెంటీ( six guarantees)ల పేరుతో తప్పుడు కాంగ్రెస్(Congress) పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) ఫైర్ అయ్యారు. సనత్ నగర్లోని సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జై ప్రకాష్ నగర్, కైలాష్ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేదు. అలాంటి రాష్ట్రానికి ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలు తిరిగి BRS ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.