మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 8: అబద్ధ్దాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని, 4నెలల పాలనలో రైతాంగాన్ని అథోగతి పాల్జేసిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సోమవారం మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి మా ట్లాడారు. పంటలు ఎండిపోయి రైతులు, గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిప డ్డారు. 209 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయారని స్వయంగా సీఎం అడగడం సిగ్గుచేటని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. మాజీ విప్ బాల్క సుమన్ మా ట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అని చెప్పి, అధికారంలోకి రాగానే ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అంతర్గత ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు హర్ష ఖరీదైన వాచీల కొనుగోలు విషయంలో చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయమై స్పందించాలని డిమాండ్ చేశారు.