ములుగు : కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు మండల మాజీ ఎంపీపీ నల్లెల కుమారస్వామి
అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కుమారస్వామి ఉద్యమ సమయంలో 2004 లో టీఆర్ఎస్ తరఫున ములుగు మండల ఎంపీపీగా పని చేశారు.
అనంతరం 2014లో మానుకోట మాజీ ఎంపీ బలరాం నాయక్ ప్రోద్భలంతో కాంగ్రెస్(Congress) లో చేరారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏర్పడ్డ కొత్త జిల్లాల్లో ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు.