Mallikarjun Kharge | తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిండు.. ఇదేదో ప్రతిపక్షాలు చెప్పిన మాటలు కాదు.. స్వయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలు! తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో ఖర్గే తన బాధను పంచుకున్నారట. ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలను బయటపెట్టారు.
సౌత్ ఫస్ట్ ఎడిటర్ తెలిపిన వివరాల ప్రకారం.. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని ఖర్గే విమర్శించారట. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని.. మంత్రుల మధ్య కీచులాటలు, వాటాల పంపకాల లొల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని ఆవేదన చెందారట. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర ఖర్గే వాపోయారట.
Kharge
మొదటి నుంచి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదని.. ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదని ఖర్గే అన్నారని సమాచారం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందనే సంకేతాలు వెళ్తున్నాయని.. అది పార్టీకి తీవ్ర నష్టం చేసిందని తెలిపారట. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న రెడ్లు, దళితులు ఈ అంశం వల్ల మనకు దూరం అయ్యారని పేర్కొన్నారట.. పోనీ బీసీలు అయినా మనకు దగ్గర అయ్యారా అంటే అదీ లేదు.. రేవంత్ చేసిన నిర్వాకం వల్ల అన్ని కులాల వాళ్లూ కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారని మండిపడ్డారట. అనవసరంగా రేవంత్ ఇందులోకి రాహుల్ గాంధీ పేరును లాగాడని. ఇది రాహుల్ ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేసిందని బాధపడ్డారట.