BRS | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నాయకులు దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే ఎన్ఎస్యూఐ నాయకులు దాడులకు పాల్పడినప్పటికీ.. వాళ్లు చోద్యం చూస్తూ ఉండటం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూ నాయకులు గుంపుగా వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై సైతం దాడికి యత్నించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి
రేవంత్ చేతగాని పాలనపై విమర్శలను తట్టుకోలేకనే దాడి
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం అనంతరం ఒక్కసారిగా గుంపులుగా వచ్చి… pic.twitter.com/shXug4OZAZ
— BRS Party (@BRSparty) January 11, 2025
కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రేవంత్ చేతగాని పాలనపై విమర్శలను తట్టుకోలేకనే కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడ్డారని తెలిపింది. పాలన చేతగాక, మీ అసమర్థతపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడింది.
బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి
పోలీసుల సమక్షంలోనే దాడులు.. చోద్యం చూస్తున్న పోలీసులు
రాష్ట్రంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్.. యదేచ్ఛగా కాంగ్రెస్ నాయకుల దాడులు
మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్… pic.twitter.com/537G7XUlha
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025