హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తులో భాగంగా చెన్నూర్ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్నది. అయితే, చెన్నూర్లో పోటీ చేయవద్దని సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ తీర్మానం చేసింది. బలం లేని చోట పోటీ వద్దని పేర్కొన్నది. చెన్నూర్ టికెట్ ప్రతిపాదనను విరమించుకోవాలని మందమర్రి కార్మిక సంఘం విభాగం కోరింది. దీంతో ఆదిలోనే సీపీఐకి ఉహించని షాక్ తగిలినట్టయ్యింది.