మహబూబ్నగర్, నవంబర్ 14: ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి 500 మంది కారెక్కారు.
పార్టీ సంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను సోదరభావంతో చూసుకుంటామని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు చెప్పాలని కోరారు.