వరంగల్ : టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం రామవరం, రామేశ్వరం గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కొడకండ్ల మండలం రామవరం, రామేశ్వరం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వరరెడ్డి , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిందే రామోజీ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో చేరారు.
కాంగ్రెస్ కు చెందిన రామేశ్వరం గ్రామ ఉప సర్పంచ్ అర్కే సరితాదుర్గయ్య, బీజేపీకి చెందిన గువ్వ నర్సింహా, రామవరం గ్రామం కాంగ్రెస్కు చెందిన తోట మురళి, వార్డు మాజీ మెంబర్ బొమ్మగాని యకలక్మిశ్రీనివాస్, ఏడెల్లి ఐలయ్య, తోట విష్ణు, బొమ్మగాని ఆంజనేయులు, చెంచు ఉమేష్, సైదులు, కౌడగని రాజు, దుడిగాని సోమేశ్, నరగా లింగన్న తదితరులు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ మేటి సోమరాములు, రామేశ్వరం సర్పంచ్ జాటోత్ రాములు, ఏఎంసీ డైరెక్టర్ సోమేశ్వరరావు , పార్టీ గ్రామ ఇన్చార్జి బాకి ప్రేమకుమార్, సీనియర్ నాయకులు, కటారి కృష్ణమూర్తి , మండల యూత్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.