BRS Party | సూర్యాపేట జిల్లాల్లో కారు జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి పెరుగుతున్నది. దీంతో వివిధ పార్టీల నేతలు అభివృద్ధికి ఆకర్షితులపై బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. సూర్యాపేట 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు మంత్రి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి అభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, పంతంగి దశరథ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో కొత్తపల్లి సందీప్, కలకోట్ల సుధాకర్, ఇలిందల శ్రావణ్, కంచన పెళ్లి సురేష్, చిలకల మహేశ్, మరి పెళ్లి మహేశ్, కుసు దుర్గాప్రసాద్, సిరికొండ అంజితోపాటు ఇతర నేతలు, కార్యకర్తలు ఉన్నారు.