Minister Jagadish Reddy | బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలువాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారంరోజులుగా వివిధ పార్టీలకు చెందిన నేతలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. పదో వార్డుకు చెందిన బీఆర్ఎస్ ఇన్చార్జి కనుకు రేణుక అధ్యక్షతన కుప్పిరెడ్డిగూడెంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 50 మంది, ఆత్మకూరు మండలం బావుసింగ్ తండాకు చెందిన 48 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో కనుకు ఎల్లయ్య, కనుకు దామోదర్, కనుకు వెంకటేశ్, ఉటుకూరి నరేశ్, రాంపంగి గోపి, కనుకు మనోజ్, కనుకు ఎల్లమ్మ, చెడుపల్లి ఎల్లమ్మ, కనుకు అనసూర్యమ్మ, కామల్ల శైలజ, పిడతల రమణ, చెడుపల్లి రాజు, కనుకు రాకేశ్తో పాటు పలువురు ఉన్నారు. అందరికీ మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో సూర్యాపేట జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేశామన్నారు. పదేండ్ల కిందట సూర్యాపేటకు.. ఇప్పటి పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. పట్టణాలతో పాటు గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, ప్రజలు ఎన్నికల్లో పార్టీకి అండగా నిలువాలని కోరారు.