ఆలేరు టౌన్ , మే 2 : ఆలేరు నియోజకవర్గస్థాయి ‘ప్రజా పాలన- ప్రణాళిక’ రసాభాసగా మారింది. శనివారం ఆలేరులోని ఇమ్మడి నరసింహారెడ్డి గార్డెన్లో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో అధికారులు ఇచ్చిన నివేదికను ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న చదివి వినిపించారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛన్లున, రేషన్ కార్డులు, రైతుభరోసా, రైతు బీమా, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం పని తీరు, సీఎం వైఖరిని మల్లన్న తప్పుపట్టారు.
దీంతో ఆయన స్పీచ్ను కాం గ్రె స్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కార్యక్రమం గందరగోళంగా మారింది.