హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయిస్తే తప్పేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించొద్దని గవర్నర్కు బీజేపీ, వీహెచ్పీ వినతిపత్రాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.
తిరుమలకు సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని, అందులో ఒక్కశాతమైన రూ.40 కోట్లను భక్తుల సౌకర్యార్థం వెచ్చిస్తే తప్పేమిటని పేర్కొన్నారు. భక్తుల మౌలిక సదుపాయాల కోసం ఆ నిధులను వెచ్చించాలని, విడిది, పార్కింగ్, రోడ్లు తదితర సౌకర్యాలను కల్పించాలని సూచించారు.