హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 643 గురుకులాల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉండగా, ప్రవేశపరీక్ష కోసం 1,20,654మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సెక్రటరీ, వీటీజీ సెట్ కన్వీనర్ సీతాలక్ష్మి ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరికి రాష్ట్రవ్యాప్తంగా 338 సెంటర్లలో ప్రవేశపరీక్ష నిర్వహించగా, 1,13,383 (93.97 శాతం) మంది హాజరైనట్టు వివరించారు.