మెదక్ : బీఆర్ఎస్ నాయకుడు(BRS leader) సాప సాయిలును అటవీ శాఖ అధికారులు అక్రమంగా అరెస్టు చేయడంపై గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. సాయిలు అరెస్టును నిరసిస్తూ మెదక్(Medak) ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం(Forest Range office) ముందు గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
హవేలీ ఘన్పూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సాప సాయిలును అటవీ శాఖ అధికారులు అక్రమంగా అరెస్టు చేసి తీసుకొచ్చారని లావణ్య రెడ్డి ఆరోపించారు.
సాయిలుకు తక్షణమేస్టేషన్ బెల్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అతనిపై పెట్టిన కేసు కూడా అక్రమమైన కేసు అని స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిలుకు స్టేషన్ బెయిల్ ఇచ్చేంతవరకు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముందు నుంచి కదలమని బైఠాయించారు.