హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మహిళా కమిషన్తో పాటు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఎంపీ మహిళ పట్ల అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ మహిళా నాయకులు ముక్తవరం సుశీలా రెడ్డి ఫిర్యాదులో ఆరోపించారు.
ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిటి సివిల్ కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించి అసభ్యంగా, అభ్యంతరంగా, అవమానించే విధంగా మాట్లాడారన్నారు. గతంలోనూ ఎంపీ అరవింద్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని పేర్కొన్నారు. భవిష్యత్లో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ మహిళా నాయకులు ఊరుకొరని హెచ్చరించారు. చట్టపరంగా పోలీసులు, మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో సుశీలారెడ్డితో లీలా, సువర్ణా రెడ్డి, గీతాగౌడ్, ఉమావతి, ప్రభారెడ్డి, సుజాతా గౌడ్, ప్రీతి రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.