జోగులాంబ గద్వాల : కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గంజిపల్లి గ్రామం వద్ద రూ.192 కోట్లతో 0.2 టీఎంసీల నీటిని తీసుకోవడానికి పంప్ హౌస్ కోసం టెండర్లు పిలిచినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తులో సకాలంలో వర్షాలు పడకపోతే జూరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.
కర్ణాటక రాష్ట్ర అక్రమ జల దోపిడిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరాలను వెల్లడించారు. కర్ణాటక అక్రమంగా నిర్మాణం చేపట్టడం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు జూరాల కింద తాగు, సాగు నీటికి భవిష్యత్తులో ఇబ్బందిగా మారనుందని ముఖ్యమంత్రికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు