రంగారెడ్డి : కొత్తూరు మున్సిపాలిటీని కొత్తగా మారుస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం 8,9,10,11,12 వార్డుల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తూరు ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉందని సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.2 వందలు పెన్షన్ వచ్చేదన్నారు. దాన్ని రూ. 2000వేలకు పెంచిన ఘతన సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. తెలంగాణలో గడప గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు