సుబేదారి మార్చి 28: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు గురువారం హనుమకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీసీసీ నాయకుడు బత్తి ని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు హనుమకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి 2,500 కోట్లు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద వసూలు చేసి ఢిల్లీకి పంపించారని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తాడని అబద్ధాలు చెప్పి సీఎం స్థాయి ని తగ్గించేలా మాట్లాడారని, తద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. హనుమకొండ పోలీసులు కేటీఆర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్కు కేసు బదిలీ చేశారు.