హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1 పోస్టులకు భారీగా పోటీపడుతున్నారు. శనివారం దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి గ్రూప్-1కు మొత్తం 3,80,202 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 51,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఉమ్మడి రా్రష్ట్రంలో 2011 గ్రూప్-1 నోటిఫికేషన్లో 312 పోస్టులకు 3 లక్షల దరఖాస్తులు వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో 503 పోస్టులకు 3.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంచిన చివరి నాలుగు రోజుల్లో కొత్తగా 28,559 మంది దరఖాస్తు చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.