దేవరకొండ, నవంబర్ 4: బీజేపీ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా సామాన్యులు సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన గుర్రం రాజశేఖర్ స్పందించాడు.
శుక్రవారం నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్లో వచ్చిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. భారతదేశాన్ని కాపాడండి’ అన్న శీర్షిక, సీఎం కేసీఆర్ ఫొటోను దేవరకొండ బస్టాండ్లోని తన పేపర్ స్టాల్ ముందు అతికించి ప్రజలను ఆలోచింపజేస్తున్నాడు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టే శక్తి సీఎం కేసీఆర్కే ఉన్నదని రాజశేఖర్ పేర్కొంటున్నాడు.