హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ) : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక ని పుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల్శక్తి శాఖ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీలో ఇరు రాష్ర్టాల నుంచి నలుగురు చొప్పున అధికారులు, కేంద్ర సంస్థల నుంచి నలుగురిని నియమించింది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్ర జల్శక్తి శాఖ సూచించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించే ఈ కమిటీలో తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యానాథ్దాస్తోపాటు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్బొజ్జా, ప్రత్యే క కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఏపీ నుంచి ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ న ర్సింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలను మెంబర్లుగా నియమించింది.
అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) చైర్మన్ బిశ్వా స్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్డబ్ల్యూడీఏ) సీఈ దాస్, సీడబ్ల్యూసీ ప్రా జెక్టు అప్రయిజల్ ఆర్గనైజేషన్(పీఏవో) సీఈ పైథాంకర్ను కేంద్రం నుంచి సభ్యులుగా కమిటీలో చోటు కల్పించడంతో పాటు సాంకేతిక నిపుణులను సైతం నియమించుకొనే వెసులుబాటు కల్పించింది. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ తొలుత పోలవరంబనకచర్ల(నల్లమలసాగర్) లింక్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా జూలై 16న ఇరు రాష్ర్టాల సీఎంలు భేటీ అయ్యారు. బనకచర్లతో పాటు, ఇతర జలవివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని నిర్ణయించారు. గత నెల 15న ఏపీ నలుగురు అధికారులను నిపుణుల కమిటీకి సిఫార సు చేస్తూ కేంద్రానికి నివేదించింది. 23న తెలంగాణ సర్కారు సైతం ఏడుగురు అధికారుల జాబితాను నివేదించడంతో జల్శక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది.
తెలంగాణ అధికారులకు దక్కని చోటు
కమిటీలో తెలంగాణ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం నుంచి అధికారులకు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. నదీ జలాల వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులు, నిబంధనలు, పొరుగు రాష్ర్టాలతో ఉన్న ఒప్పందాలు, ప్రాజెక్టు లు తదితర అంశాలను అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. కోర్టు పిటిషన్లు, ట్రిబ్యునల్ వాదనలకు ఆ విభాగం అధికారులే కీలకంగా వ్యవహరిస్తారు. తాజా కమిటీ తెలంగాణ నుంచి కీలక అధికారులకు చోటు కల్పించకపోవడం గమనార్హం. ఏపీ నుంచి జలవనరుల విభాగం సీఈకి కమిటీలో కేంద్రం చోటు కల్పించింది. తెలంగాణ అధికారులను మాత్రం చేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ సల్లా విజయ్కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్ పేర్లను సైతం కేంద్రానికి నివేదించింది. కానీ కేంద్రం మాత్రం వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
సర్కారు తీరుపై తీవ్ర వ్యతిరేకత !
పొరుగు రాష్ట్రం చేపడుతున్న నల్లమలసాగర్ను బేషరతుగా వ్యతిరేకించకుం డా తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఉ త్సాహం చూపడం, కమిటీకి అంగీకరిం చి రావడంపై ఇప్పటికే తెలంగాణ సమా జం నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, నీటిరంగ నిపుణులు, తెలంగాణవాదుల నుంచి సైతం ఆగ్రహం వ్యక్తమవుతున్న ది. ఏపీ పేర్లను పంపిన వారంలోగానే రేవంత్ సర్కార్ సైతం గుట్టుగా కేంద్రానికి రాష్ట్ర అధికారుల పేర్లను ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణవాదులు తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జలహక్కులను ఏపీకి తాకట్టు పెట్టడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపార అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జలనిపుణులు ఉన్నారని, వారిని పకనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం, కమిటీకి ప్రతిపాదించడం అందులో భాగమేనని తేల్చిచెబుతున్నారు.