హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోపన్పల్లిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఈ నెల 17న బ్రాహ్మణ పరిషత్ పెద్దలు సమావేశం ఏర్పాటుచేశారు.
శృంగేరి, పుష్పగిరి, హంపి సహా మరో ఆరుగురు పీఠాధిపతులను ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అతిథులు ఉండడానికి గదులు, భోజన సదుపాయాలతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు, హంగులతో బ్రాహ్మణ సదన్ నిర్మాణం పూర్తయింది. అందులోనే పెండ్లిళ్లు, ఉపనయనాలతో సహా ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా 600 మంది సామర్థ్యం కలిగిన కల్యాణ మండపాన్ని కూడా నిర్మించారు.