హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలపై కొలంబియా బృందం పరిశోధన చేస్తున్నది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫెర్నాండెజ్ రూయిజ్ ఆధ్వర్యంలో 34 మందితో కూడిన బృందం బుధవారం హైదరాబాద్కు చేరుకొని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొన్నది. కొలంబియా బృం దం అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ కృషికి దక్కిన గుర్తింపు అని మంత్రి కేటీఆర్ అన్నారు. కొలంబియాకు సహకా రం అందించేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి భారత్లో కొలంబియా రాయబారి మరియాన పాచికో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, హైదరాబాద్ ఫార్మాసిటీ లిమిటెడ్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా జీనోమ్ వ్యాలీ వంటి ప్రదేశాలను సందర్శించనున్నది. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల చుట్టూ పర్యావరణ పరిరక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయన్నది తెలుసుకోవడంతోపాటు కొత్త నిబంధనల ప్రకారం జీనోమ్ వ్యాలీలోని సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.