వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం మండలాల్లో జిల్లా కలెక్టర్ హరిత పర్యటించారు. వివిధ గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం కొనుగోలుపై రైతులు, నిర్వాహకులు, హమాలీలతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించార. కలెక్టర్ వెంట ఆర్డీవో సంపత్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి…
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
ఏరియా హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే చల్లా
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్