కొత్తగూడెం: ఆమె ఓ జిల్లాకు ప్రథమ మహిళ. అందుబాటులో సకల వసతులు. అయితేనేం సర్కారు దవాఖానలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీత్ సతీమణి మాధవి భద్రాచలం ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం మగశిశువుకు జన్మనిచ్చారు.
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత జిల్లా ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే. జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ ఆమె సర్కారు దవాఖానలో గతనెల 21న ఆడబిడ్డకు జన్మనిచ్చారు.