హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి ప్రారంభమైంది. రుతుపవనాలు తిరుగు ముఖం పట్టడంతో రాష్ట్రం వైపు చలిగాలులు వీస్తున్నాయి. హనుమకొండలో కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు, ఆదిలాబాద్లో 17.2 డిగ్రీలు నమోదైంది.
పగటివేళ హనుమకొండ, మెదక్, రామగుండంలలో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయి. ఖమ్మంలో మాత్రం సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా.. గరిష్ఠంగా 35.2 డిగ్రీలు నమోదైంది.వచ్చే రెండు మూడ్రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.