హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చలి తీవ్రత పెరగుతున్నది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దంపడుతున్నది. గురువారం ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్-టీలో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 8.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 9.4 డిగ్రీలు, మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా జుక్కల్లో 10.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కోట్గిరిలో 10.4, కొండపాకలో 10.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 10.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మరిపల్లిలో 10.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.