Huzurabad | హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని రామాలయం టెంపుల్లో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలోని శివలింగం చుట్టూ ఆ పాము చుట్టుకుంది. పడగ విప్పిన నాగుపామును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇక శివలింగానికి భక్తులు పూజలు చేశారు.
రామాలయంలోని శివలింగం చుట్టూ నాగుపాము చుట్టుకున్న వార్త భక్తులకు, స్థానికులకు తెలిసింది. దీంతో ఇరుగుపొరుగు గ్రామాల నుంచి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. కొందరు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మరికొందరు తమ మొబైల్స్లో నాగుపామును చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
గత నాలుగు రోజుల నుంచి ఆలయ పరిసరాల్లో నాగుపాము సంచరిస్తున్నట్లు భక్తులు తెలిపారు. శనివారం నాడు ఆలయంలోకి ప్రవేశించి, శివలింగం చుట్టూ చుట్టుకుందని పేర్కొన్నారు.