భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. మండలంలోని మద్దులపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి ఇండ్లలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.