కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలోని ఇల్లందులో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. వాన కారణంగా టేకుపల్లి పరిధిలోని కోయగూడెం గనిలో ఐదో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షంకారణంగా 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటకం ఏర్పడింది. ఇక మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, ఇందారం ఉపరిత గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా 80 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపును అధికారులు నిలిపివేశారు.