RTC Bus | జయశంకర్ భూపాలపల్లి : మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, ఆర్టీసీ డ్రైవర్, ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.