హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడం.. రైతులు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగులకు మొదటి వారంలో జీతాలు ఇవ్వడంతోనే రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాల అమలులో జాప్యం జరుగుతున్నదని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడం సరికాదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు ఇవాల్సినవి ఇవ్వకుండా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారనే విధంగా సీఎం వ్యాఖ్యలు ప్రేరేపిస్తున్నాయని, ఈ భావన రైతాంగానికి ఉద్యోగులపై కోపం పెంచే విధంగా ఉందని చెప్పారు.