నల్లగొండ : ముఖ్యమంత్రి సహయనిధి పపేద ప్రజలకు వరం లాంటిదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 100 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో ఈ మూడేండ్ల కాలంలో 15 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ చెక్కులను పేదలకు పంచినంట్లు భూపాల్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యం బాగాలేక ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారికి కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.