హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వీ సత్యనారాయణ తెలిపారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, మీడియా ప్రతినిధుల వాహనాల పారింగ్ కోసం 15స్థలాలను కేటాయించినట్లు పేరొన్నారు.