హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో నిర్వహించే ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు తేనీటి విందు ఉంటుందని, తర్వాత 4 గంటల నుంచి సమావేశం ప్రారంభం అవుతుందని అందులో పేర్కొన్నారు. సంబంధిత అంశాలపై సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు. ప్రధానంగా ధరణి, భూ సంబంధ సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు, వనరుల సేకరణ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నదని సమాచారం.