DK Aruna | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అడ్డాకుల, మదనాపురం, కొత్తకోట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు.
ఆరు పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతో జనాన్ని మభ్యపెడుతున్నదని డీకే అరుణ ధ్వజమెత్తారు. గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కులేదని అన్నారు. ఫ్రీ బస్సులో మహిళలు సిగలు పట్టుకుంటున్నారని విమర్శించారు. పథకం అమలు చేసినప్పుడు బస్సులను పెంచాలన్న ఆలోచన ఆ పార్టీ నేతలకు లేదని దుయ్యబట్టారు. రావణాసురుడి వంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఉండనివ్వకూడదని ఆమె అన్నారు.