హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరగనున్నది. దీనికి అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీఎంలు హాజరుకానున్నారు. రేవంత్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు.