హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ 133వ జయంతిని (ఏప్రిల్ 14వ తేదీ) పురసరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటు పడిన మహనీయుడు అంబేదర్ అని సీఎం కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేదర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
ప్రజల హకుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేదర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. అంబేదర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జీవం పోసిందని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తుందని తెలిపారు.