తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మెక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారి హరీంద్రనాథ్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మెక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్ధప్రసాదాలు అందేశారు.
#WATCH | Tirupati: Telangana CM Revanth Reddy alongwith his family members visits Tirumala Venkateswara Temple to offer prayers to Lord Balaji. pic.twitter.com/byzWZxL3EB
— ANI (@ANI) May 22, 2024