హైదరాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant sevalal maharaj) జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. గురువారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బంజారాహిల్స్(Banjarahills)లోని సంత్ సేవాలాల్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని( Statue) ఆవిష్కరించి నివాళులు అర్పించారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.