హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా ఆయనపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కేసీఆర్పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైంది. మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ సభలో సీఎం ప్రసంగానికి వివిధ టీవీ చానళ్లలో వచ్చిన వీక్షణలే ఇం దుకు నిదర్శనం. మరోవైపు బీఆర్ఎస్కు పోటీగా అదే సమయంలో మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్రెడ్డి సభలో మాట్లాడితే.. ఏ చానల్లో చూసినా వెయ్యిలోపే వీక్షణలు కనిపించడం గమనార్హం.
మంగళవారం దాదాపు ఒకే సమయానికి నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మేడిగడ్డ బరాజ్ను పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వీరిద్దరి ప్రసంగాలను వినడానికి ప్రజలు, అభిమాను ల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. కేసీఆర్ ప్రసంగాన్ని చానళ్లు అన్నీ కలిపితే 4.5 లక్షల మంది వీక్షించారు. కానీ, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగానికి 10వేల లోపే వ్యూయర్స్ ఉం డటం గమనార్హం. దీనిని బట్టి 2 నెలల కాలంలోనే సీఎం మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఆయనపై ప్రజల్లో ఆసక్తి కనిపించడం లేదని తెలుస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అంటే ప్రజల్లో అభిమానం కొండంతలా కనిపిస్తున్నదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.