హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్షాతో బుధవారం భేటీ అయ్యారు. డీజీపీ శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి కేంద్ర హోం మంత్రిని కలిశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ముందు మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి, దామోదర్, నూనె నర్సింహారెడ్డి తదితరులు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతల లొంగుబాటుకు సంబంధించిన వివరాలను అమిత్షాకు అందించినట్టు తెలిసింది. ఈ భేటీలో నేతల లొంగుబాటుకు సంబంధించి కీలక చర్చ జరిగినట్టు సమాచారం.మార్చి 31న ఢి ల్లీలో నిర్వహించనున్న మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్కు సంబంధించిన అంశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, మావోయిస్టు ఆగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా సమక్షంలో లొంగిపోయినట్టు ప్రచారం జరిగింది. అందుకే సీఎం రేవంత్రెడ్డితోపాటు డీజీపీ శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి ఢిల్లీకి వచ్చారనే ప్రచా రం జరిగింది. కానీ, గణపతి లొంగుబాటు లేదని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 64వసారి.