Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. మంగళవారం రాత్రి ముంబై వెళ్లిన సీఎం అక్కడ పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులతోనూ భేటీ అయినట్టు సమాచారం. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ గురువారం రాష్ట్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మీనాక్షీ నటరాజన్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 11న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. వారంలోనే మరోసారి ఢిల్లీ వెళ్లడం, మంత్రులతో ఏఐసీసీ పెద్దలు సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 63వసారి కావడం గమనార్హం.