హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలకపాత్ర అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. 1969లో మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు అని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురసరించుకొని శుక్రవారం ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు.
నిజాం వ్యతిరేక పోరులో ఓ వైపు పాల్గొంటూనే, మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందేమాతరం, క్విట్ ఇండియా ఉద్యమాల్లోనూ బాపూజీ భాగస్వామి అయ్యారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయటంతోపాటు బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారని పేర్కొన్నారు.