హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో ఇంజినీర్ల పాత్ర చాలా ముఖ్యమని, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం అసోసియేషన్ బాధ్యులతో మాట్లాడారు.
ఇంజినీర్లు కష్టపడి పనిచేసి సంస్థల నష్టాలను తగ్గించాలని సూచించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. విద్యుత్తు సంస్థల్లో సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఎస్పీఈఏ అధ్యక్ష కార్యదర్శులు పీ రత్నాకర్రావు, పీ సదానందం, ఎస్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ జనప్రియ, టెక్నికల్ సెక్రటరీ గోపాలకృష్ణ, విద్యుత్తు సౌధ బ్రాంచ్ సెక్రటరీ మల్లయ్య ఉన్నారు.