Telangana | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటుచేసిన విధానంపై పునర్విచారణ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శనివా రం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఒక జిల్లాలో మూడునాలుగు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. జడ్పీ సమావేశం నిర్వహిస్తే ముఖముఖాలు చూసుకోవటం తప్ప మరేమీ ఉం డట్లేదు.
ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి కూడా మూడునాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ ఎంపీ ఏదై నా చేయాలంటే ఆ మూడునాలుగు జిల్లాల కలెక్ట ర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తున్నది. 33 జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోవటం కూడా కష్టంగా ఉన్నది. జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తాం. దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తాం. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకొంటాం’ అని తెలిపారు.