హైదరాబాద్ : ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ(Farmers loans) చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సోమవారం నిజామాబాద్లో(Nizamabad) పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామన్నారు. ఆరో గ్యారంటీ రైతుల రుణమాఫీ పథకం చేపట్టే లోపే ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.