CM Revanth Reddy | రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్ను నియమించడంతో పాటు ఆయ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు.
అవసరమైన నిధులు, వనరులతో పాటు సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీఎస్ నాబ్ను తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు. సమీక్షలో ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ విభాగం అడిషనల్ ఈజీ శివధర్రెడ్డి, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.