Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను సీఎం రేవంత్ పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నంను మార్చొద్దని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ, రేవంత్ మాత్రం పెడచెవిన పెట్టారు. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చారు.
టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ను టీఎస్ బదులుగా టీజీగా ఉపయోగిస్తున్నారు. లెటర్ హెడ్స్ రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ జీవోలు ఇతర అధికారిక వెబ్ సైట్లు ఆన్లైన్ జీవోల్లో టీజీగా మార్చారు.